'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

ప్రకాశం: సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించాలనికనిగిరి మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ మున్సిపల్ పరిధిలోని గార్లపేట రోడ్డు, కాశిరెడ్డి బజారు, పామూరు రోడ్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చిన ప్రజలకు వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.