ధాన్యం రైతులకు జేసీ కీలక సూచనలు
W.G: ధాన్యం తరలింపు సమయంలో రైతులు కల్లాలు, RSK వద్దే ట్రక్ షీట్ నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. మిల్లుల వద్ద నమోదు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రవాణా ఛార్జీలు రావని కేంద్రం హెచ్చరిస్తోందని తెలిపారు. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు హితవు పలికారు.