విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
సత్యసాయి: మడకశిర టౌన్లో శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ప్రతిష్టకు శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఒక్కలిగా రాష్ట్ర కార్పోరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.