'మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరం'

HNK: పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని ప్రజలు గుర్తించి మరింత విరివిగా మొక్కలు నాటాలని జాతీయ గణాంక కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మనాభ స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణాంక కార్యాలయ 75వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం 100 మొక్కల నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించారు.