'కార్మిక హక్కులను హరిస్తున్నాయి'
SKLM: ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం పొందూరులో అంబేద్కర్ జంక్షన్ వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. కార్మిక హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.