'వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు'
SDPT: ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లిలో ప్రజలకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతన గేట్వాల్ నిర్మాణం చేసినట్లు సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గేట్వాల్ రిపేర్ కావడంతో దానిని తీసి వేయించి కొత్త గేట్వాల్ వేసినట్లు వెల్లడించారు. ప్రజలకు తాగునీరు ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యమని అన్నారు.