ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే
GDWL: కేటీదొడ్డి మండలం సుల్తాన్పురం గ్రామానికి చెందిన సిద్ధప్ప గౌడు పేద కుటుంబీకుడు అనారోగ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ.2,25,000 మంజూరయ్యాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకోగా ఈ నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఈ మొత్తానికి సంబంధించిన ఎల్వోసీని బాధితునికి అందజేశారు.