జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య

జేఎన్టీయూలో  విద్యార్థి ఆత్మహత్య

SRD: సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సుల్తాన్‌పూర్ JNTU హాస్టల్‌లో చోటుచేసుకుంది. SRPT జిల్లా మోతె(M) సిరికొండ గ్రామానికి చెందిన మహేష్ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజులుగా కాలేజీకి వెళ్లకుండా రూమ్‌లోనే ఉంటున్నట్లు తోటి విద్యార్థుల తెలిపారు. సూసైడ్ నోట్‌ను యూనివర్సిటీ సిబ్బంది తీసుకున్నట్లు సమాచారం.