శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే
KRNL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే పీవీ పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు శేష వస్త్రం, ప్రసాదాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్ధించారు.