VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,200, కొత్త మిర్చి ధర రూ.19,000, అటు క్వింటా పత్తి ధర రూ.7,600గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.500, పత్తి ధర రూ.100 పెరగగా, కొత్త మిర్చి రూ.150 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.