ఎన్సీడీ స్క్రీనింగ్ వైద్య శిబిరం ప్రారంభం
NLG: మాటూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్సీడీ స్క్రీనింగ్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ జిన్నే సిద్దులు ప్రారంభించారు. ఏళ్ల తరబడి వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డ గ్రామస్తుల కోసం ఈ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ధ్యేయమన్నారు. మండల వైద్యాధికారి డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు.