CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. మొత్తం 14 మంది బాధితులకు రూ. 6,49,171 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.