పార్కు స్థలం కాపాడాలని ధర్నా

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ 34 పరిధిలోని రామచంద్ర రెడ్డి నగర్లో పార్కు స్థలం కాపాడాలని కోరుతూ స్థానికులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం సమర్పించారు. కొందరు వ్యక్తులు పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు స్పందించి పార్కు స్థలాన్ని కాపాడాలని వారు కోరారు.