ఆర్టీసీ డిపోలో వేసవి రక్షణ చర్యలపై అవగాహన

KDP: బద్వేల్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు వేసవి రక్షణ చర్యలపై అవగాహన సదస్సు జరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉద్యోగులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిపో మేనేజర్ RC. నిరంజన్ సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే విధులను సక్రమంగా నిర్వహించగలరని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.