ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: శృంగవరపుకోట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి ఆదివారం అత్యంత వైభవంగా శంకుస్థాపన జరిగింది. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొని పూజలు చేశారు. ఇందులో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమపూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఉన్నారు.