‘అర్హులకు న్యాయం చేయాలి’

GNTR: అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి నూర్ బాషా, అల్లా బాషా కోరారు. పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎం.రమేశ్ బాబును మంగళవారం దివ్యాంగ నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల జరిగిన రీ-వెరిఫికేషన్లో డాక్టర్ల అవగాహన లోపంతో చాలామంది దివ్యాంగులకు పర్సంటేజీలు తగ్గాయన్నారు.