ఎలక్ట్రికల్ డీఈఈగా గంగారం నియామకం
జగిత్యాల ఎలక్ట్రికల్ డీఈఈ గా గంగారాం నూతనంగా నియామకమయ్యారు. నూతనంగా నియామకమైన డీఈఈ గంగారాం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, శ్రీరామ్ భిక్షపతి, దూమాల రాజ్ కుమార్, నరేందర్ రావు పాల్గొన్నారు.