స్వామివారి సేవలో DGP ఆంజనీ కుమార్

స్వామివారి సేవలో DGP ఆంజనీ కుమార్

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం DGP ఆంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటం బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.