'మంత్రి కమీషన్ల కోసమే.. యూరియా కొరత'

NLG: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కమీషన్ల దందా వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని… మాజీ మంత్రి, సూర్యాపేట MLA గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంత్రులకు కమీషన్ల మీద ఉన్న సోయి రైతులపై లేదని ఆవేదనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాజీ MLA లు గాదిరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నల్లగొండ BRS కార్యాలయంలో మాట్లాడారు.