రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: కమిషనర్
KKD: నగరంలోని రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ ఎన్.వి.వి.సత్యనారాయణ హెచ్చరించారు.ఇవాళ జగన్నాధపురం డివిజన్లో పర్యటించిన ఆయన, రోడ్లపై ఉన్న టీ గ్లాసులు, ప్లాస్టిక్ డబ్బాలు చూసి వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఆయన కోరారు. తడి, పొడి చెత్త సేకరణ పద్ధతులపై కూడా ఆయన ఆరా తీశారు.