కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటాం: ఎర్రబెల్లి
JN: కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన బిక్షపతి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పారు.