నారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

నారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇవాళ ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం గోపూజ కార్యక్రమం నిర్వహించారు.