జగద్గిరిగుట్టలో కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్ మృతి
TG: జగద్గిరిగుట్ట బస్టాండ్లో అందరూ చూస్తుండగానే రోషన్ సింగ్పై బాల్రెడ్డి అనే మరో రౌడీషీటర్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సింగ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ హత్యకు మరో ఇద్దరు దుండగులు సహకరించారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం.