అంబేద్కర్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
బాపట్ల: చీరాలలోని ముక్కోణపు సెంటర్లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు సాధనలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు.