ఒక్కో కుటుంబ సగటు జీతం రూ.33,894
HYDలో కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. 2050 HMDA సమగ్ర మొబిలిటీ ప్లాన్ సర్వే ప్రకారం, ఒక్క గృహం సగటు ఆదాయం రూ.33,894గా నమోదైంది. ఇందులో ప్రయాణ ఖర్చులకే సుమారు రూ.2,000 వరకు వెచ్చిస్తున్నారు. కుటుంబాల్లో కేవలం 40 శాతం మంది మాత్రమే ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. నగర జీవన ఖర్చులు కుటుంబాలపై భారంగా మారుతున్నాయని పేర్కొంది.