ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్
WNP: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్. సునీత మాట్లాడుతూ.. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశమని తెలిపారు. ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో సివిల్, వివాహ సంబంధిత, ప్రమాద క్లెయిమ్, చెక్ బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు.