BREAKING: మండలిలో పడిపోయిన బొత్స

BREAKING: మండలిలో పడిపోయిన  బొత్స

AP: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసన మండలిలో అస్వస్థతకు గురయ్యారు. మండలిలో మాట్లాడుతూ.. తూలి కిందపడిపోబోయారు. వెంటనే అప్రమత్తమైన మరో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెంటనే ఆయన్ను పట్టుకున్నారు. అసెంబ్లీ అధికార వర్గాలు అత్యవసర వైద్యులను పిలిపించారు. బొత్సను పరీక్షించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ హెచ్చుతగ్గుల వల్ల అలా జరిగిందని తెలిపారు.