బుడుమూరులో శాస్త్రవేత్తల చిత్రపటాలు ప్రదర్శన
SKLM: లావేరు మండలం బుడుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CV రామన్ చిత్రపటానికి హెచ్ఎం పూర్ణచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో 50 మంది శాస్త్రవేత్తలను పరిచయం చేస్తూ చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల గోవిందరావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.