కరోనాతో మరో ముగ్గురు మృతి

భారత్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా మరో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఛండీగఢ్లో ఈ మరణాలు సంభవించారు. అరుణాచల్ ప్రదేశ్లో తొలి కొవిడ్ కేసు నమోదైంది. కర్ణాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య 126కు చేరింది. తమిళనాడులో 69, మహారాష్ట్రలో 72, బీహార్లో 10, పశ్చిమ బెంగాల్లో 16కు చేరాయి.