మేయర్గా పాక సురేష్ ప్రమాణ స్వీకారం
కడప నగరపాలక సంస్థ నూతన మేయర్గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలోని ఎంపీ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఆయన పేరును ఆమోదించారు. నేడు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో పాక సురేష్ నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు.