మాజీ గవర్నర్‌ను కలిసిన ఆచారి

మాజీ గవర్నర్‌ను కలిసిన ఆచారి

NGKL: కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హైదరాబాద్‌‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 30న జరగనున్న తన కుమారుడు తల్లోజు భరత్ వివాహానికి హాజరు కావాలని కోరుతూ మాజీ గవర్నర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.