సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

AKP: ప్రజల సమస్యల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని స్వీకరించిన మంత్రి ప్రజలతో మాట్లాడారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.