అందెశ్రీ మృతి తెలంగాణకు తీరని లోటు: మంత్రి
MDK: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్థివదేహానికి మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం నివాళులర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. తన మాట, పాటతో పేదల జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపిన గొప్ప కవి అని తెలిపారు.