'వ్యాక్సిన్ వేయించడం వల్ల క్షయ వ్యాధిని అరికట్టవచ్చు'

'వ్యాక్సిన్ వేయించడం వల్ల క్షయ వ్యాధిని అరికట్టవచ్చు'

నంద్యాల: నవజాత శిశువులకు బీసీజీ వ్యాక్సిన్ వేయించడం వల్ల క్షయ వ్యాధిని అరికట్టవచ్చని డా.షాహలాం అన్నారు. మంగళవారం చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాహలాం మాట్లాడుతూ.. క్షయ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ మహమ్మారిని అంతం చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.