కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాగమయి

ఖమ్మం: సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి మాట్లాడారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయం కోసం ఎన్నికల రోజున కష్టపడిన నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు.