పాకిస్థాన్ రాజధానిలో పేలుడు.. 9 మంది మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఓ కారులో బాంబు పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.