తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు నిప్పంటించుకున్న యువకుడు
HYDలో సంచలనాత్మక ఘటన వెలుగుచూసింది. బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సాయి అనే యువకుడు 'తీన్మార్ మల్లన్న' కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. మల్లన్న ఆఫీస్లో లేరని చెప్పడంతో, బయటకు వచ్చిన ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై, మంటలు ఆర్పేసి, అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.