కాకినాడలో సెన్సస్- 2027 స్వీయ నమోదు ప్రారంభం
కాకినాడలో సెన్సస్-2027 స్వీయ నమోదు ప్రక్రియను గురువారం అధికారికంగా ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ NVV సత్యనారాయణ యాప్ ద్వారా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేత కుటుంబ వివరాలు నమోదు చేయించారు. ఈ నెలాఖరు వరకు https://census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.