ఉపాధ్యాయుల సమస్యలపై డీఈఓకు వినతి
ప్రకాశం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డీఈఓ రేణుకకు మార్కాపురం జిల్లా PRTU అధ్యక్షుడు రమణారెడ్డి వినతిపత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఐఆర్ ప్రకటించాలని, PRC ఛైర్మన్ను నియమించాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.