పేదలకు రంజాన్ ఈద్ కిట్లు
నంద్యాల పట్టణంలో జమీయత్ ఉలేమా హింద్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు 150 రంజాన్ ఈద్ కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై కిట్లు అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు అండగా నిలవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.