'ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి'
NGKL: జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థానిక అవసరాల మేరకు ఇసుక వినియోగం పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని అధికారులను సూచించారు.