యాదాద్రి దేవస్థాన నేటి ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు బుధవారం రూ.20,66,947 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,02,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,04,000, VIP దర్శనాలతో రూ.2,10,000, ప్రసాద విక్రయాలతో రూ.5,32,680, కార్ పార్కింగ్తో రూ.3,19,000, వ్రతాలతో రూ.4,42,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి ఈ ఆదాయం వచ్చిందని తెలిపారు.