బీజేపీ నేత వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

ఒక ముస్లీం మహిళా ఐఏఎస్ అధికారిపై కర్ణాటక బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కలబురిగి డిప్యూటీ కమిషనర్ పాక్ నుంచి వచ్చారా? లేదంటే ఇక్కడి ఐఏఎస్ అధికారో తనకు తెలియదన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. బీజేపీ నేత వ్యాఖ్యలు చాలా అసహ్యకరమైనవని అన్నారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు నిజమైన భారతీయులేనా అని సందేహం కలుగుతుందని వ్యాఖ్యానించారు.