కారులో భారీగా నగదు లభ్యం

కారులో భారీగా నగదు లభ్యం

HYD: సికింద్రాబాద్ పరిధిలో బోయిన్ పల్లి క్రైమ్ పోలీసులు రూ.4 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో ఈ అక్రమ నగదును తరలిస్తుండగా, పోలీసులు తనిఖీ చేసి హవాలా ముఠాను పట్టుకున్నారు. ఈ భారీ మొత్తంలో ఉన్న నగదును నిందితులు కారు టైరు, సీట్ల కింద దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది