'రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తిలో బాగస్వాములు కావాలి'

MNCL: సింగరేణి ఉద్యోగులు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తిలో బాగస్వాములు కావాలని బెల్లంపల్లి ఏరియా GM విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఖైరీ గూడ OCP వద్ద రక్షణ,ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి ఏరియాకు ప్రథమ చికిత్సలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి రావడం ప్రశంసనీయమన్నారు.