రంగారెడ్డి జిల్లా టాపర్కు అభినందనలు

RR: ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షల్లో రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించిన కార్తీక్ను డీఈవో సుసీందర్ రావు, విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య అభినందించారు. గణేశ్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి పి.కార్తీక్ 584మార్కులు సాధించిన సందర్భంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.