మహిళా సాధికారత విషయంలో చిత్తశుద్ధి లేదు: స్వర్ణ
HNK: మహిళా సాధికారత విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. గాంధీభవన్లో "మహిళా ఆరక్షన్ బిల్ ఆజ్ కరో, అభి కరో" అనే నినాదంతో పోస్ట్ కార్డుపై సంతకాల సేకరణ చేపట్టి పీఎంవో ఆఫీస్కు పంపించారు. మోడీ గ్యారెంటీ అని చెప్పి మహిళలను బీజేపీ మోసం చేసిందని స్వర్ణ మండిపడ్డారు.