VIDEO: కూతురు పుట్టిన మూడు రోజులకే తండ్రి మృతి
నిజామాబాద్కు చెందిన వ్యక్తి బాసర గోదావరిలో మునిగి మృతి చెందాడు. CI కిరణ్ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం తండ్రైన ఆకాష్ (31) కూతురిని చూడటానికి నిర్మల్ జిల్లా కుబీర్కు వెళ్లాడు. తిరిగి నిజామాబాద్కు వెళ్లే క్రమంలో స్నానం కోసం గోదావరిలో దిగి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మృతదేహం లభ్యమైంది.