విశాఖపట్నం-రాయ్ పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు

విశాఖపట్నం-రాయ్ పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు

విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సంబల్‌పూర్ డివిజన్‌లోని మునిగూడ-బిస్సాంకటక్ మధ్య వంతెన ఆధునీకరణ పనులు చేపట్టడమే దీనికి కారణమన్నారు. ఏప్రిల్ 9, 11, 13, 20, 23, 25 తేదీల్లో రైలు నంబర్లు (58528/58527) రెండు వైపులా నడవవని తెలిపారు.