ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు..!
అన్నమయ్య: జిల్లా తంబళ్లపల్లి బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్పై ఇవాళ ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వెంటనే వారు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుప్రతికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.